బైక్ రైడర్స్ కి ఘనస్వాగతం

కామారెడ్డి, బతుకమ్మ: కేరళ నుంచి లడఖ్  వెళ్తున్న బైక్ రైడర్స్ కి ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కామారెడ్డి వద్ద ఘనస్వాగతం పలికారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ నాయకులు, సీడీసీ చైర్మన్ ఇర్షాద్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కురుమ సాయిబాబా, టీపీసీసీ మైనార్టీ జనరల్ సెక్రెటరీ రఫీయొద్దీన్ బైక్ రైడర్లకు స్వాగతం పలికి టిఫిన్, ఛాయ్ ఏర్పాట్లు చేశారు. వాయనాడ్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా బైకర్లు అన్నారు.