Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 September 2025, 4:48 pm Posted by : ramakrishna

ఫిజియోథెరపీ భవన నిర్మాణానికి కృషి చేస్తా

  • అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఫిజియోథెరపీ భవన నిర్మాణానికి కృషి చేస్తానని  అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు.  ప్రగతినగర్ మున్నూరు కాపు కళ్యాణ మండపంలో నిర్వహించిన  వరల్డ్ ఫిజియోథెరపీ దినోత్సవం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు “ఆధునిక జీవన శైలిలో ఫిజియోథెరపీ అత్యంత అవసరమైన వైద్య సేవగా మారిందన్నారు. ఫిజియోథెరపిస్టులు అందిస్తున్న సేవలు అభినందనీయం,” అని పేర్కొన్నారు. 2025, ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం యొక్క థీమ్ ” ఆరోగ్యకరమైన వృద్ధాప్యం “, ఇది బలహీనత మరియు పడిపోవడాన్ని నివారించడంపై ప్రత్యేక దృష్టి పెడుతుందని దీని చేరే దిశగా మరింత సేవలు అందించాలని అన్నారు.  ఫిజియోథెరపీ  డాక్టర్లను & విద్యార్థుల కార్యకలాపాలను మరింత ప్రోత్సహించే దిశగా ఇందూర్ నగరంలో సొంత భవనానికి తన వంతు సహకారం అందిస్తాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు డాక్టర్ జి శివ కుమార్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జి ప్రమోద్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ బి సందీప్ కుమార్, డా. ఎం.కీర్తి,  డా. అశ్విని జోషి, డాక్టర్ రాజేంద్రప్రసాద్, ఫిజియోథెరపీ డాక్టర్స్ తదితరులు పాల్గొన్నారు.

We will work towards the construction of a physiotherapy building.