. . . జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి
రుద్రూర్ బతుకమ్మ :
పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యే విద్యార్థుల కోసం కృషి చేస్తానని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి అన్నారు. ఆదివారం రుద్రూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి సందర్శించారు. గ్రంథాలయంలోని వసతులను ఆయన పరిశీలించారు. నిరుద్యోగులు, విద్యార్థులు పోటీ పరీక్షలకు ప్రశాంతంగా సన్నద్ధం కావడానికి భవనంపై ఉన్న గదిని వినియోగించుకునేలా సౌకర్యం కల్పించాలని సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్ ను ఆయనను కోరారు. ఆయన వెంట ఉపసర్పంచ్ షేక్ నిస్సార్, వార్డు మెంబర్లు, గ్రంథాలయ సిబ్బంది ఉన్నారు.
