నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: విద్యా రంగ సమస్యలను పట్టించుకోకపోతే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని ఎస్ఎఫ్ఐ, పీడీఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శులు రాచకొండ విఘ్నేశ్, డాక్టర్ కర్క గణేశ్ అన్నారు. హాస్టళ్లలో నాణ్యత లేని ఆహారం, ఫుడ్ పాయిజన్ లు, విద్యార్థుల మరణాలను నిరసిస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శనివారం ప్రభుత్వ పాఠశాలల బంద్ పాటించారు. కార్యక్రమంలో ఏఐఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి రఘురామ్, పీడీఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్, ఏఐపీఎస్ యూ జిల్లా కార్యదర్శి బోడ అనిల్, ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షురాలు దీపిక, నవీన్, కుశాల్, సాయి, సంజయ్, తదితరులు పాల్గొన్నారు.