పోచారం రిజర్వాయర్, నాగన్న మెట్ల బావిని అభివృద్ధి చేస్తాం
శాసనభలో మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటన వెబ్ న్యూస్, బతుకమ్మ : కామారెడ్డి జిల్లాలోని పోచారం రిజర్వాయర్, నాగన్న మెట్ల బావిని అభివృద్ధి చేస్తామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శాసన సభలో ప్రకటించారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. నాగిరెడ్డి పేట మండలంలోని పోచారం రిజర్వాయర్ ను ఎకో టూరిజం, వాటర్ బేస్డ్ రిక్రియేషన్ గమ్యస్థానంగా అభివృద్ధి చేసి, ప్రోత్సహించడానికి ప్రభుత్వం వద్ద ఏమైనా ప్రతిపాదనలు ఉన్నాయా? లింగంపేట గ్రామంలోని ప్రాచీన దిగుడు మెట్ల...