పండించిన ప్రతీ గింజను కొనుగోలు చేస్తాం
ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మాచారెడ్డి, బతుకమ్మ : రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ కృషి చేస్తోందని, పండించిన ప్రతీ గింజను కొనుగోలు చేస్తామని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. మాచారెడ్డి మండలం లక్ష్మీ రావులపల్లి గ్రామంలో మహిళా సమైక్య ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్నిగురువారం ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా షబ్బీర్ ఆలీ మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మండల రైతులు విని యోగించుకోవాలని కోరారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని,...