- ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి
బతుకమ్మ బోధన్ : బోధన్ పట్టణంలోని 11 వార్డ్ రాకాసిపేట్, 15వార్డు పాన్ గల్లి, శక్కర్ నగర్ లో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజ నిర్వహించారు. లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. నిర్మాణాలలో భాగంగా బోధన్ లో మొదటి విడతగా అన్ని వార్డులను కలిపి 600 ఇల్లు మంజూరు చేశామని తెలిపారు. అనంతరం టిటిడి కళ్యాణ మండపంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ 128 చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ పద్మశరత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
