Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 May 2025, 10:38 am Posted by : ramakrishna

ప్రజలపై దాడి చేస్తే తగిన విధంగా బుద్ధి చెబుతాం : అమిత్ షా

డిల్లీ, బతుకమ్మ : ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు ’ఆపరేషన్ సిందూర్‘ పై ఆయన స్పందించారు. భారత్, ప్రజలపై దాడి చేస్తే నరేంద్ర మోదీ ప్రభుత్వం తగిన విధంగా బుద్ధి చెబుతుందని పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత బలగాలు ఆపరేషన్ సిందూర్ చేపట్టాయన్నారు. ఉగ్రవాదులు పాల్పడిన దారుణ హత్యలకు భారత్ స్పందనే ఈఆపరేషన్ అని వ్యాఖ్యనించారు.