Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 July 2026, 7:45 pm Posted by : ramakrishna

పర్యావరణ పరిరక్షణకై మొక్కలు నాటాలి

 

వేల్పూర్, బతుకమ్మ :

 

పర్యావరణాన్ని పరిరక్షించడానికి ప్రతి ఒక్కరు తమ వంతుగా మొక్కలు నాటాలని డీ ఆర్ డీ ఏ నిజామాబాద్ జిల్లా డిపిఎం కిరణ్ అన్నారు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా వేల్పూర్ మండలంలోని మహిళా సమాఖ్య భవనం ఆవరణంలో శుక్రవారం మొక్కలు నాటే కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో నాటిన మొక్కలను సంరక్షించడం అంతే ముఖ్యం. మొక్కలు నాటి వాటిని పరిరక్షించడం వల్ల అడవుల శాతం పెరుగుతుందని ఫలితంగా వర్షాలు సక్రమంగా  కురవడంతో పంటలు సమృద్ధిగా పండుతాయని తెలియజేశారు. కార్యక్రమంలో వేల్పూర్ ఏపీఎం బత్తుల మాణిక్యం, సీసీలు వెన్న మురళీ, సాయన్న, సరళ, లక్ష్మి, మహిళా సమాఖ్య వీవోఏ లు తదితరులు పాల్గొన్నారు.