Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 March 2026, 9:31 pm Posted by : ramakrishna

కులము, మతము లేని సమాజం కొరకై ముందుకు వెళ్లాలి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

నవ యవ్వన వయసులో దేశ కోసం ఉరి తాడుని ముద్దాడిన విప్లవ వీర కిశోరులైన షహీద్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లను స్ఫూర్తిగా తీసుకొని కులము, మతము లేని సమాజం కొరకై ముందుకు వెళ్లాలని పీడీఎస్ యు నిజామాబాద్ నగర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎండి. నజీర్, ఆర్.వినోద్ కుమార్ లు పిలుపునిచ్చారు. షహిద్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవుల 95వ వర్ధంతి సందర్భంగా నగరంలో కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కర్క గణేష్, ఎల్.అనిల్ కుమార్, నగర సహాయ కార్యదర్శి సృజన్, విద్యార్థులు పాల్గొన్నారు.