Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 August 2025, 7:34 pm Posted by : ramakrishna

16 గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల

మెండోరా, బతుకమ్మ: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ 16 గేట్ల ద్వారా 52850 క్యూసెక్కుల నీటి విడుదల గోదావరిలోకి కొనసాగుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి ఎస్సారెస్పీ లోకి 150000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. ఇందిరమ్మ వరద కాలువ ద్వారా 20,000 క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 5,000 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 3000 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు, 80.5 టిఎంసిలు కాగా బుధవారం 1088.2 అడుగులు, 70.425 టీఎంసీల నీరు నిలువ ఉంది.