ఆర్మూర్, బతుకమ్మ : ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వెళ్తున్న బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఆర్మూర్లో పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. జాతీయ రహదారి 44 పక్కన బిఆర్ఎస్ శ్రేణులతో కొద్దిసేపు ఆగి కేటీఆర్ ముచ్చటించారు. అనంతరం ఆదిలాబాద్ వైపు పయనమయ్యారు. కేటీఆర్ కు స్వాగతం పలికిన వారిలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, బాజిరెడ్డి జగన్, ఇతర ముఖ్య నాయకులు ఉన్నారు.
