నిజామాబాద్ సిటి, బతుకమ్మ :
నగరంలోని 44 డివిజన్ లోని ద్వారక్ నగర్ లోని ఫ్రీడం పార్కులో వార్డు సభ నిర్వహించారు. బుధవారం డివిజన్ లో ప్రజాపాలన లో దరఖాస్తు చేసుకోని వారు వార్డు సభలో ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం తర్వాత అర్హులైన వారికి రైతుభరోసా కొత్త రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇళ్ళు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల లబ్దిదారుల ఎంపిక కోసం వార్డు సభలు నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బైకన్ సుధా, కాంగ్రెస్ నాయకులు కొండపాక రాజేష్, నరేందర్ గౌడ్, రాజేంద్రప్రసాద్, దేవి, శీల శ్రీనివాస్, శివ, నూరి భాస్కర్, స్థానిక అధికారులు తదితరులు పాల్గొన్నారు.