Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 February 2025, 2:10 pm Posted by : ramakrishna

’వృక్షార్చన‘ పోస్టర్ విడుదల  

హైదరాబాద్, బతుకమ్మ :  ఈ నెల 17న కేసీ ఆర్ జన్మదినం సందర్బంగా ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈమేరకు ’వృక్షార్చన‘ పోస్టర్ ను కేటీఆర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, బీఆర్ఎస్ ఆఫీస్ సెక్రటరీ, మాజీ రాజ్యసభ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, బిగాల గణేష్, శంకర్ నాయక్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో-ఫౌండర్ రాఘవ లు విడుదల చేశారు. ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడుతు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఈ వృక్షార్చనలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈసందర్బంగా మాజీ ఎంపీ సంతోష్ కుమార్‌ను కేటీఆర్ అభినందించారు.