Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 October 2024, 5:42 pm Posted by : ramakrishna

స్వచ్ఛందం గా వ్యాపార సంస్థల మూసినేత

పిట్లం, బతుకమ్మ : హైదరాబాదులోని ముత్యాలమ్మ ఆలయాన్ని ఓ వర్గానికి చెందిన వ్యక్తి ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ హిందూ ధార్మిక సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన, ధర్నాలు కొనసాగిస్తున్నారు. పిట్లం మండలంలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పహార కాచారు.వ్యాపార సంస్థలు, స్వచ్ఛందంగా మూసివేసి బంద్ కు సహకరిస్తున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రవాణా సౌకర్యాన్ని యథావిధిగా కొనసాగాలని హిందూ ధార్మిక సంఘాలు సూచించారు. ప్రతి హిందూ బిడ్డ ఇలాంటి సంఘటనలు జరిగిన వెంటనే స్పందించాలని విశ్వవిద్ పరిషత్ పిలుపునిచ్చారు. బందుకు సహకరించిన వ్యాపారస్తులు చిరు వ్యాపారాలు తెలిపారు. ఇబ్బందులు హిందూ ముద్దుబిడ్డ పాల్గొన్నారు.