బీసీ సంక్షేమ సంఘం వైస్ ప్రెసిడెంట్గా వోల్లేపు రాజు నియామకం
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా వైస్ ప్రెసిడెంట్గా సారంగాపూర్ (13వ డివిజన్) ప్రాంతానికి చెందిన వోల్లేపు రాజు నియమితులయ్యారు. ఈ మేరకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ రైగ అరుణ్ కుమార్ లు శుక్రవారం ఒక ప్రకటనలో అధికారిక ఉత్తర్వులను జారీ చేశారు.