నిజామాబాద్, బతుకమ్మ : స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఇండియన్ హెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో గాజులపేట్ లో వివేకానంద చౌరస్తాలో గల స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రెడ్ క్రాస్ రక్త నిధిలో రక్తదాన శిబిరం లో22వ సారి బొబ్బిలి రామకృష్ణ, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ ఆంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట రాజశేఖర్, కోశాధికారి కరిపి రవీందర్, వెంకటేశం, మెడికల్ ఆఫీసర్ రాజేష్, సభ్యులు అబ్బాయి లింబాద్రి, గణేష్ పాల్గొన్నారు.
