బతుకమ్మ , బాన్సువాడ : విశ్వబ్రాహ్మణ మనుమయ యువజన సంఘ కార్యవర్గ ప్రమాణ స్వీకారా మహోత్సవానికి రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుల వృత్తిపై ఆధారపడి జీవించే వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడం జరుగుతుందని, గ్రామాలలో వడ్రంగి వృత్తిపైనే ఆధారపడి జీవించే వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు.ఈ కార్యక్రమములో మాజీ ఎమ్మెల్యే కత్తెర గంగాధర్ , కృష్ణారెడ్డి , బోడ బాస్కర్ నార్ల సూరి , ఎజాస్ , హకీమ్ , ముఖ్యనాయకులు సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
