బోధన్ ఎసిపి శ్రీనివాస్
బోధన్, బతుకమ్మ : ఆంగ్ల నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డివిజన్లోనీ ప్రజలు ఆంక్షలను అతిక్రమిస్తే శిక్షలు తప్పవని బోధన్ ఏసిపి శ్రీనివాస్ హెచ్చరించారు. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు డిసెంబర్ 31 మంగళవారం రాత్రి, జనవరి 1 తేదీన ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగిందని, ఆంగ్ల నూతన సంవత్సరాన్ని డివిజన్లోని ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. డిసెంబర్ 31 రాత్రి నుంచి జనవరి 1 తేదీన ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, రాంగ్ సైడ్ డ్రైవ్, రాష్ డ్రైవింగ్ చేయకూడదని సూచించారు. శాంతి భద్రతలకు విగాథం కలిగించరాదని, ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవని అన్నారు.