Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 September 2025, 1:37 pm Posted by : ramakrishna

రెండో రోజు  కొనసాగిన వినాయక నిమజ్జనం 

వెబ్ డెస్క్, బతుకమ్మ :   వినాయక నవరాత్రుల ముగింపు సందర్భంగా జరిగే గణేష్ నిమజ్జన శోభయాత్ర కొనసాగుతుంది.  ఆదివారం కూడా వినాయక విగ్రహాలు నిమజ్జనం దిశగా కదులుతున్నాయి. 9 రోజుల పాటు భక్తి శ్రద్దలతో సాగిన ఉత్సవాల ముగింపు సందర్భంగా నిమజ్జనోత్సవం కోసం క్యూ కట్టాయి. ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో భారీ విగ్రహాలు నిమజ్జనం కోసం గోదావరి(గంగా)కు నది కోసం నవీపేట్, జన్నెపల్లి మీదుగా, నందిపేట్, ఉమ్మెడ బ్రిడ్జికి తరలివెళ్లాయి. కామారెడ్డి పట్టణంలోనూ రెండవ రోజు నిమజ్జనం వేడుకలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన నిమజ్జన ప్రక్రియ కొనసాగుతుంది. పోలీసు శాఖ అధికార యంత్రాంగం నిమజ్జనం పర్యవేక్షిస్తున్నారు. రెండు రోజులుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండానే నిమజ్జనం కొనసాగుతుంది. సాయంత్రం వరకు నిమజ్జనం ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.