Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 October 2025, 6:34 pm Posted by : ramakrishna

రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిని పరామర్శించిన వినయ్ రెడ్డి

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిని ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి నిజామాబాద్ రూరల్ క్యాంపు కార్యాలయం లో పరామర్శించారు. గత నెల 29 న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి తల్లి లక్ష్మి నర్సమ్మ  మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మరణించిన విషయం తెలుసుకున్న ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి సోమవారం నగరంలోని బైపాస్ రోడ్డులో గల రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ని పరామర్శించారు.  ప్రగాఢ సానుభూతి  తెలిపారు. మృతుకి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.రేకుల పల్లి లక్ష్మీ నర్సమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన వెంట ఆర్మూర్ ఎ ఎం సీ చైర్మన్ సాయిబాబా గౌడ్, కాంగ్రెస్ నాయకులు పండిత్ పవన్, అశోక్ భూపేందర్,నటరాజ్, కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు.