ఎస్సెస్సీ ఫలితాల్లో విజయ్ హై స్కూల్ విజయ దుందుబి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : 2024-25 విద్యా సంవత్సరానికి గాను పదో పరీక్షల్లో 188 మంది విద్యార్థులు పరీక్షలు రాసి వంద శాతం ఉత్తీర్ణత సాధించారని విజయ్ హై స్కూల్ కార్యదర్శి డా.అమృతలత తెలిపారు. వీరిలో ఇషిత 600 మార్కులకు 588, యూనిస్ సోషన్ 587, తనుశ్రీ 586 మార్కులు సాధించారని తెలిపారు. 158మంది విద్యార్థులు 500పైగా మార్కులు సాధించారని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు.