. . డీసీఎంలో ఉన్న 162 క్వింటాళ్ళ పీడీఎస్ బియ్యం స్వాధీనం
కామారెడ్డి, బతుకమ్మ :
కామారెడ్డి పట్టణంలోని దేవునిపల్లిలో గల సాయిశ్రీనివాస ట్రేడింగ్ మిల్లులో పీడీఎస్ రీసైక్లింగ్ జరుగుతుందన్న విశ్వసనీయ సమాచారం మేరకు విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు, సివిల్ సప్లయ్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. రాంచంద్రపురం విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు కామారెడ్డి సివిల్ సప్లయ్ డీటీ తో కలిసి మంగళవారం రైసుమిల్లుపై దాడి చేశారు. అక్కడ పీడీఎస్ బియ్యంతో ఉన్న డీసీఎంను పట్టుకున్నారు. అందులో లావుడ్యా అరవింద్, డిరావత్ సురేష్ లు పీడీఎస్ బియ్యం 162 క్వింటాళ్ళు తీసుకువచ్చి అమ్ముతున్నారని గుర్తించి పట్టుకున్నారు. వారిపై కేసులు నమోదు చేసి సంబంధిత బియ్యంను సివిల్ సప్లయ్ అధికారులకు అప్పగించారు.