Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 November 2024, 1:34 pm Posted by : ramakrishna

శాస్త్రినగర్ లో పశువైద్య శిబిరం

నిజామాబాద్, బతుకమ్మ: రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ ఆధ్వర్యంలో నిజామాబాద్ రూరల్ మండలం శాస్ర్తినగర్ లో గురువారం పశువైద్య శిబిరం ఏర్పాటు చేశారు. పశువులు రోగాలబారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పాడిరైతులకు అవగాహన కల్పించారు. పశువులకు టీకాలు వేసి పౌష్టికాహారం ప్యాకెట్లు అందజేశారు. కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ ఏడీఏ గంగాధరయ్య, పశు వైద్యులు గోపీకృష్ణ, శిరీష, బాబురావు, ట్రెయినీ డాక్టర్ చంద్రకాంత్, శివకుమార్, ఆర్ సీ ఎఫ్ లిమిటెడ్ కంపెనీ మార్కెటింగ్ ఆఫీసర్స్ సునీల్ కుమార్, శివ కృష్ణ, అధికారులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.