అక్రమంగా ఆవులను తరలిస్తున్న వాహనం బోల్తా

ఐదు ఆవులకు గాయాలు   బతుకమ్మ కామారెడ్డి: అక్రమంగా ఆవులను తరలిస్తున్న వాహనం బోల్తా పడిన ఘటన కామారెడ్డి బైపాస్ లో చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదు ఆవులకు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ క్లీనర్ పరారీ ఘటన స్థలానికి హైవే పోలీసులు వచ్చి జిఎంఆర్ పెట్రోలింగ్ సహాయంతో ఆవులను కాపాడారు.   బక్రీద్ సందర్భంగా పోలీసులు చెక్ పోస్టులు పెట్టిన ఆగని ఆవుల అక్రమ దందా ను అరికట్టాలని బజరంగ్ దళ్ కార్యకర్తలు కోరుతున్నారు.