నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
ఆదివారం విడుదలైన తెలంగాణ ఈఎపిసెట్ ఫలితాల్లో వెక్టార్ కళాశాల విద్యార్థులు విజయ దుందుభి మోగించారు. ఇంజనీరింగ్ విభాగంలో మొర స్వగత్ శ్రీ వాస్తవ 2630 వ ర్యాంకు సాధించగా, జి.శ్రీ నిధి రెడ్డి 4163 వ ర్యాంకు, దువ్వ యశ్వంత్ 4939 ర్యాంకు, ఎస్.మనస్విని 5653 ర్యాంకు లు సాధించారని కళాశాల చైర్మన్ మధుసూదన్ జోషి తెలిపారు. ఇరవై వేల లోపు ర్యాంకులను ఇరవై ఐదు మంది విద్యార్థులు సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులను కళాశాల డైరెక్టర్ లు సంతోష్, కార్తిక్, గజానన్ అభినందించారు.


