ఏసీబీకి పట్టుబడిన వర్ని ఎస్సై
\వర్ని, బతుకమ్మ: లంచం తీసుకుంటూ నిజామాబాద్ జిల్లా వర్ని ఎస్సై కృష్ణకుమార్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు. ఓ రైతు నుంచి రూ.20వేలు లంచం తీసుకుంటుండగా ఆయనను ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో పట్టుకున్నారు. రైతు నుంచి లంచం తీసుకుంటూ ఎస్సై పట్టుబడడం పోలీసుశాఖలో కలకలం రేపింది.