కాంగ్రెస్ మున్సిపల్ అభ్యర్థిగా వందన హనుమంత్

  బిచ్కుంద, బతుకమ్మ :   కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపల్ పరిధిలో గల కందర్ పల్లి గ్రామం 5 వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వందన హనుమంత్ ఎన్నికల బరిలో నిలిచానని తెలిపారు. కందర్ పల్లి 5వ వార్డులో గల ప్రధాన సమస్యలపై దృష్టి సారిస్తానని రాష్ట్ర ప్రభుత్వం అండతో గ్రామ అభివృద్ధి చేస్తానని తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో ఐదవ వార్డు మున్సిపల్ అభ్యర్థిగా గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.