Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 November 2024, 7:36 pm Posted by : ramakrishna

వాల్మీకి రాసిన రామాయణం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే ఆదర్శం

 – అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

నిజామాబాద్ సిటీ బతుకమ్మ : వాల్మీకి రాసిన రామాయణాన్ని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నడుస్తుందన్నారు. విద్యార్థులు విద్యతో పాటు మనదేశ సంస్కృతి, సంప్రదాయాలను అలవరుచుకోవాలన్నారు. శుక్రవారం నగరంలో భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు శివకుమార్ అధ్యక్షతన అంబేద్కర్ భవన్ లో నిర్వహించిన వాల్మీకి జయంతి ముగింపు వేడుకలకు ముఖ్యఅతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే  మాట్లాడుతు సమస్త మానవాళికి ఆ శ్రీరాముని జీవిత చరిత్ర ఆదర్శం అని, ఆ శ్రీరాముని జీవనయనమే రామాయణం అని అన్నారు. ఆ మహాగ్రంధమే లేకుంటే రాముడేవరో మనకు తెలిసేది కాదని, అలా తెలిసేలా రామాయణ గ్రంధాన్ని రచించిన మహాపురుషుడె వాల్మీకి అన్నారు. ఆ మహనీయుని జయంతి సందర్బంగా విద్యార్థుల్లో నైపుణ్యాన్ని వెలికితిసే కార్యక్రమాన్ని తీసుకుకున్న ఎస్ సీ మోర్చా జిల్లా కమిటీని వారు అభినందించారు. విద్య అనేది ఒక విలువైన సంపద అని  విద్యతో పాటు వినయం, విధేయత చాలా ముఖ్యం అని ఎడ్యుకేషన్, హార్డ్ వర్క్, డెసిప్లైన్ ఈ మూడు విద్యార్థుల భవిష్యత్ ను నిర్ణయిస్తాయన్నారు. విద్యార్థులు విద్యతో పాటు వివిధ క్రీడా, సంస్కృతిక, కళ రంగాలలో కూడా రాణించాలని అన్నారు. అటువంటి నైపుణ్యలను పెంపొందించుకొని విద్యార్థులు భవిష్యత్తును ఉన్నత లక్ష్యం చేరుకునేలా ఈ దేశ కీర్తి ప్రతిష్టలు పెంపొందించేలా ఉన్నత లక్ష్యాలను సాధించాలన్నారు. విద్యతో పాటు మన భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను అలవాటు చేసుకొని వాటిని ఆచరిస్తూ భావి తరాలకు ఆదర్శంగా నిలవాలని, మన సంస్కృతి అనేది ఒక ధర్మం, ఆ ధర్మాన్ని ఆచరించాడు కాబట్టే శ్రీరాముడు దేవుడు అయ్యాడని అన్నారు. మనమందరం మన దేశ సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తూ భవితరాలకు వాటిని అందించాలని సూచించారు. అనంతరం వివిధ పోటిల్లో పాల్గొని విజయం సాధించిన విద్యార్థులకు మెడల్స్ అందించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, నాగోళ్ళ లక్ష్మీనారాయణ,దేవర్ సంజు,పవర్ సాయినాథ్, బోత్ శేఖర్ ముత్యాలు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Valmiki's Ramayana and Ambedkar's Constitution are ideals