పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ కమిషనరేటు కార్యాలయంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ఆదేశానుసారoగా అదనపు డి.సి.పి (ఎ.ఆర్) కె.రామచంద్ర రావు ఆద్వర్యంలో మహార్షి వాల్మీకి జయంతి కార్యాక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహర్షి వాల్మీకి ఫోటోకు పుష్పగుచ్చాలు సమర్పించారు. అనంతరం అదనపు పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ శ్రీ మద్రామాయణ మహాకావ్య సృష్టికర్త మహార్షి వాల్మీకి అని, ఒక సామాన్య వ్యక్తిగా పుట్టి బోయవాడిగా అడవిలో పెరిగి, సప్త ఋషుల బోధనల ద్వారా మహార్షి వాల్మీకిగా మారి అద్భుతమైన రామాయణం గ్రంథాన్ని...