Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 May 2026, 10:50 am Posted by : ramakrishna

కేరళ సీఎంగా విడి సతీషన్ ప్రమాణ స్వీకారం

 

. . . 21 మంది మంత్రుల ప్రమాణం

 వెబ్ డెస్క్, బతుకమ్మ:

కేరళ ముఖ్యమంత్రి గా విడి సతీషన్ ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం లోక్ భవన్ అధినేత రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ విడి సతీషన్ తో ప్రమాణ స్వీకారం చేశారు. కేరళ మంత్రి వర్గం కోలువు దీరే కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హజరయ్యారు.  ఇటివల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ 102 స్థానాలతో కేరళలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది.  రెండు వారాలకు పైగా తర్జన భర్జనలు అనంతరం విడి సతీషన్ ను  శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. విడీ సతీషన్ తో పాటు ఈ సంధర్బంగా 21 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకల్లో తెలంగాణ సీఎం రెవంత్ రెడ్డి తో పాటు  కేరళ మాజీ సీఎం పీనరన్ విజయ్ తదితరులు హాజరయ్యారు.