మట్టి గణపతులను వాడండి పర్యావరణాన్ని కాపాడండి
బతుకమ్మ, బోధన్: బోధన్ పట్టణంలోని ఓల్డ్ బస్టాండ్ వెంకటేశ్వర స్టీల్ షాప్ వద్ద లైన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ సేవ ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతి పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గణేష్ నవరాత్రి సందర్భంగా పర్యావరణానికి మేలు చేసే విధంగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో తయారయ్యే విగ్రహాలు నీటిని కలుషితం చేస్తాయని, జలవనరులు నాశనమవుతాయని, అలాగే పర్యావరణానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుందని తెలిపారు. అయితే మట్టి గణపతులను ఉపయోగించడం...