Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 November 2024, 6:19 pm Posted by : ramakrishna

ప్రధాని మోదీని కలిసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ 

నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు,కేంద్ర మంత్రి,కిషన్ రెడ్డి  నేతృత్వంలో ప్రజా ప్రతినిధుల బృందం బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్బంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ప్రధానమంత్రి నరేంద్రమోదీని శాలువాతో సత్కరించారు. సమావేశంలో కీలకంగా రాష్ట్రంలో ప్రజా సమస్యలు, తెలంగాణలో పార్టీ భవిష్యత్తు రాబోయే స్థానిక ఎన్నికల గురించి చర్చించడం జరిగిందన్నారు. భవిష్యత్ కార్యాచరణ పై ఎమ్మెల్యేలకు, ఎంపీలకు దిశనిర్దేశం చేసినట్లు తెలిపారు. తెలంగాణకు చెందిన 18 మంది బిజెపి ప్రతినిధులు ప్రధానమంత్రితో సమావేశం కావడం రాష్ట్ర అభివృద్ధి పథాన్ని బలోపేతం చేయడం,  కీలకమైన ప్రాంతీయ సమస్యలను పరిష్కరించడంపై బిజెపి చిత్తశుద్ధిని తెలియజేస్తుందని తెలిపారు.

Urban MLA Dhan Pal met PM Modi