బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని జంగంపల్లి చెరువులో ఒక మృతదేహం మంగళవారం లభ్యమైంది. చెరువు వద్దకు వెళ్ళిన స్థానికులకు మృతదేహం కనిపించడంతో స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న భిక్కనూరు ఎస్సై ఆంజనేయులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీసి ఆరా తీయగా దోమకొండ మండలం లింగుపల్లి గ్రామానికి చెందిన ఉప్పు భూపతిగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టంకు కామారెడ్డికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.