Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 November 2024, 7:42 pm Posted by : ramakrishna

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మంత్రికి వినతి పత్రం అందజేత

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చెందుటకు కేంద్ర ప్రభుత్వ ఎస్సీ వర్గీకరణ బిల్లును తీసుకువస్తుందని, ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఇచ్చే విధంగా సహాయ సహకారాలు అందజేయాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో మంత్రి కోమటి  రెడ్డి వెంకట రెడ్డికి వినతిపత్రం అందజేశారు. నగరంలోని కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమానికి శుక్రవారం హాజరైన సందర్భంగా వినతి పత్రం అందజేసినట్లు ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు మల్లమారి సుధాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జీ భూమన్న, జిల్లా అధ్యక్షులు మోహన్, నగర అధ్యక్షురాలు సమాధానం, శ్రీకాంత్ తెలిపారు.