Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 September 2025, 8:26 pm Posted by : ramakrishna

కడుపునొప్పి భరించలేక మహిళ ఆత్మహత్య

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలం బొప్పాపూర్ గ్రామానికి చెందిన బొర్ర సావిత్రి (62) అను ఆమె కడుపునొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై సాయన్న తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలు బొర్ర సావిత్రి గత కొన్ని రోజులుగా కడుపునొప్పితో బాధపడుతుందని, గురువారం ఉదయం 08:30 గంటలకు ఇంట్లో ఎవరూలేని సమయంలో కడుపునొప్పి భరించలేక బాత్ రూమ్ శుభ్రం చేసే యాసిడ్ త్రాగడంతో, వెంటనే చికిత్స నిమిత్తం నిజామాబాద్ లోని ప్రతిభ ఆసుపత్రికి తీసుకెళ్లగా, సాయంత్రం 7:00 గంటల సమయంలో చికిత్స పొందుతూ మృతి చెందిందన్నారు. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.