నిజామాబాద్, బతుకమ్మ :
నిజామాబాద్ నగర పాలక సంస్థ నాల్గవ మేయర్ గా కూరగాయల ఉమారాణి ఎన్నికయ్యారు. సోమవారం జరిగిన మేయర్ ఎన్నికల లోఅదికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూరగాయల ఉమారాణికి 34 ఓట్లు రావడం తో ఆమెను మేయర్ గా ప్రకటించారు. బీజేపీకి ఎక్స్ ఆఫీసీయో ఓట్లతో కలిపి 31 ఓట్లు ఉండటం తో కాంగ్రెస్ మేయర్ స్థానం కైవసం చేసుకుంది. అంతకుముందు కార్పొరేటర్ లతో ప్రమాణ స్వీకారం చేయించారు. తరువాత మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరిగింది. మేయర్ గా కసబ్ గల్లికి చెందిన 49 డివిజన్ కార్పొరేటర్ కూరగాయల ఉమారాణి, డిప్యూటీ మేయర్ గా 54 డివిజన్ మజ్లిస్ కార్పొరేటర్ సల్మా తహసీన్ ఎన్నుకున్నారు. వారి చేత అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్తగా ఎన్నికైన పాలకవర్గం ను ప్రజా ప్రతినిధులు అభినందనలు తెలిపారు.