మద్నూర్, బతుకమ్మ: డోంగ్లి మండలం లింబూర్ గ్రామం సమీపంలో రెండు ఇసుక ట్రాక్టర్లను ఆదివారం పట్టుకున్నట్లు ఎస్సై విజయ కొండ తెలిపారు. మంజీరా నది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు గుర్తించారు. వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు విజయ్ కొండ ఎస్సై తెలిపారు.