రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్
ఓనర్ల పై కేసు నమోదు బతుకమ్మ, మాచారెడ్డి: పాల్వంచ మండలం ఆరేపల్లి వాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్ల ను సీజ్ చేసి ఓనర్ల పై కేసు నమోదు చేసినట్లు మాచారెడ్డి ఎస్ఐ అనిల్ తెలిపారు. ఉమ్మడి మాచారెడ్డి మండల ప్రజలు ఎవరైనా అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ స్పష్టం చేశారు.