మోర్తాడ్, బతుకమ్మ :
అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు మోర్తాడ్ ఏఎస్ఐ గోపాల్ తెలిపారు. ఏఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం శనివారం రాత్రి అందజా 2 గంటల సమయంలో రామన్నపేట గ్రామం నుండి జాగీర్యాల గ్రామం వైపు రెండు ట్రాక్టర్లు టిఎస్ 21 టి 7819, టిఎస్ 16 ఈకే 9954 నందు ఎటువంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ లను రాత్రి సమయాలో బీట్ నిర్వహిస్తున్న కానిస్టేబుల్ లు వసంత్, రాజేష్ లు పట్టుకొని పోలీస్ స్టేషన్ కి తీసుకువకచ్చి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోద్ చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
