Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 February 2026, 7:09 pm Posted by : ramakrishna

డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడిన ఇద్దరికి జైలు శిక్షా

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 23 మందిని అరెస్ట్ చేసినట్టు ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ తెలిపారు. అనంతరం ఆయన ఆదేశానుసారం మంగళవారం ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ పి. ప్రసాద్ వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు.  అనంతరం సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ హైమద్ మొయిద్దిన్ ముందర హాజరుపరచగా 21 మందికి ఒకరికి 10,000/- చొప్పున 210,000/-జరిమానా విదించారని, బుడిగం సంతోష్, సవర్ల శ్రీధర్ అనే ఇదరూ వ్యక్తులకు మాత్రం వారం రోజుల జైలు శిక్ష విధించినట్టు ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రజలు మద్యం తాగి వాహనాలు నడపకూడదని హెచ్చరించారు.