. . . 8 మందికి జరిమానా
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 10 మందికి ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశానుసారం గురువారం ట్రాఫిక్ సిఐ ప్రసాద్ కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ హైమద్ మొయిద్దిన్ ఎదుట హాజరుపరచగా 8 మందికి ఒకరికి 10 వేల చొప్పున 80 వేల జరిమానా విదించారు. వీరిలో కల్లేపల్లి శ్రీకాంత్, షేక్ సమీఉల్లాలకు ఒక్కొక్కరికి వారం రోజుల జైలు శిక్ష విధించారు.