పసుపు అంశంపై కేంద్ర వ్యవసాయ మంత్రికి.. తుమ్మల లేఖ
వెబ్ న్యూస్, బతుకమ్మ : మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద పసుపు పంట కొనుగోలు చేయాలని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు లేఖ రాశారు. మార్చిలో పసుపు పంట భారీగా మార్కెట్ కు వచ్చే అవకాశముందన్నారు. రైతులు నష్టపోకుండా త్వరగా చర్యలు తీసుకోవాలని ఆయన లేఖలో కోరారు.