Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 June 2025, 6:39 pm Posted by : ramakrishna

టియుసిఐ  జిల్లా నూతన కమిటీ ఎన్నిక

  • టియుసిఐ మహసభ విజయవంతం

 

సిరికొండ, బతుకమ్మ : బతుకమ్మ : టి యు సిఐ మహాసభల్లో భాగంగా శుక్రవారం నూతన జిల్లా కమిటీ ఎన్నికను నిర్వహించారు. టి యు సి ఐ మహాసభలు విజయవంతం కాగా జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నికొన్నారు. ఎన్నికైన నూతన కమిటీలో  అధ్యక్షులుగా ఎం. ముత్తేన్న(అర్ముర్),ఉపాధ్యక్షులుగా కే. రాజేశ్వర్(భీంగల్), ఏ. ప్రకాష్ (కామారెడ్డి)లు, ప్రధానకార్యదర్శిగా ఆర్.రమేష్, సహాయకార్యదర్శి వి.సత్తేమ్మ, ఏం. అనిస్ లు, కోశాధికారిగా జి.అరవింద్ లను వారితో పాటు 19 మంది సభ్యులతో నూతన కార్యవర్గంను మహాసభలో ప్రతినిధులు ఎన్నుకొన్నారు. మహాసభల ప్రారంభంకు ముందు డప్పు నృత్యం, ర్యాలీ నిర్వహించి ఎర్రజెండాను ఎగరావేసి అమరవీరులకు నివాళులర్పించారు.