టీటీడీ కల్తీ నెయ్యి కేసు : 11 మందిని నిందితులుగా చేర్చిన సిట్
తిరుమల, బతుకమ్మ : టీటీడీ కల్తీ నెయ్యి కేసులో సీబీఐ ఆధ్వర్యంలో సిట్ విచారణ వేగవంతం చేసింది.ఈకేసులో తాజాగా మరో 11 మందిని నిందితులుగా చేరుస్తూ నెల్లూరు ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది. ఇందులో ఏడుగురు టీటీడీ ఉద్యోగులు ఉన్నారు. దీంతో ఈకేసులో ఇప్పటి వరకు పేర్కొన్న నిందితుల సంఖ్య 35కి చేరింది. ఇందులో 10 మంది అరెస్టు చేశారు.