బతుకమ్మ, నందిపేట్ : నందిపేట్, డొంకేశ్వర్ ఉమ్మడి మండలాలకు చెందిన ప్రైవేటు పాఠశాలల(ట్రస్మా ) అసోసియేషన్ కార్యాలయాన్ని శుక్రవారం నందిపేట మండల కేంద్రంలో ఉమ్మడి మండలాల ట్రస్మా అధ్యక్షులు చుక్కబొట్ల దేవన్న అధ్యక్షతన నందిపేట్ మండల విద్యాశాఖ అధికారి అవధూత గంగాధర్, డొంకేశ్వర్ మండల విద్యాశాఖ అధికారి రామకృష్ణ చేతుల మీదుగా కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ట్రస్మా అధ్యక్షులు రాస నిత్యానందం, ట్రస్మా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పండ్ల రమేష్, ట్రస్మా జిల్లా జనరల్ సెక్రటరీ గోజూరి అరుణ్, ట్రస్మా జిల్లా కోశాధికారి ఉప్పల మధు, స్థానిక మాజీ ఎంపీటీసీ సభ్యులు ఎర్రం సిలిండర్ లింగం, శ్రీ సాయి కళాశాలల అధినేత నాగ సురేష్, ట్రస్మా నందిపేట్ మండల ప్రధాన కార్యదర్శి సన్నీ, కోశాధికారి తోట మురళి, ఉమ్మడి మండలాలకు చెందిన 15 మంది కరస్పాండెంట్స్ పాల్గొన్నారు.