ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ నివాళి

హైదరాబాద్, బతుకమ్మ :  నట సౌర్వభౌముడు, తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు 102 వ జయంతి సందర్భంగా బుధవారం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి హీరోలు ఎన్టీఆర్, కల్యాణ్ రాం నివాళులు అర్పించారు.  తాత సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి వారు ఘనంగా నివాళులు అర్పించారు. తెలుగు ప్రజలకు ఎన్టీఆర్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.