Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 December 2025, 1:17 pm Posted by : ramakrishna

పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలి

హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో   నిర్వహిస్తున్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌ల జాతీయ సదస్సుకు   ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపదిముర్ము హాజరయ్యారు.  ఈ సందర్భంగా  రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు.  నియామకాల అంశంలో పబ్లిక్ సర్వీస్‌ కమిషన్లు వేగంగా స్పందిస్తున్నాయని తెలిపారు. నియామకాల్లో పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని  సూచించారు. 1950 తర్వాత యూపీఎ స్సీ , పబ్లిక్‌ సర్వీస్ కమిషన్లు ఏర్పాటు అయ్యాయని గుర్తుచేశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ల అంశంలో అంబేడ్క ర్‌ కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు.  నియామకాల్లో ఎదురవుతున్న సవాళ్లకు త్వరిగతిన పరిష్కారం అవసరమని తెలిపారు. రాష్ట్రపతి వెంట మంత్రి సీతక్క ఉన్నారు.