Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 August 2024, 10:08 am Posted by : ramakrishna

. . . పది రోజులలో రెండోసారి స్థాన చలనం

బతుకమ్మ, నిజామాబాద్ క్రైం:

నిజామాబాద్ పోలిస్ కమీషనరేట్ పరిధిలో పది రోజులలో పలువురు ఎస్ఐలకు రెండోసారి బదిలీ చేస్తు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఖాళీగా ఉన్న పలు పోస్టులను భర్తి చేశారు. ఇటివల కమ్మర్ పల్లి నుంచి బోదన్ రూరల్ పోలిస్ స్టేషన్ ఎస్ హెచ్ఓ గా నియమితులైన రాజశేఖర్ ను మాక్లూర్ కు బదిలి చేశారు. బోదన్ టౌన్ ఎస్ఐ మచ్చెందర్ ను బోదన్ రూరల్ ఎస్ హెచ్ఓగా బదిలీ చేశారు. ఇటివల విఆర్ కు పంపిన పాండేరావును ఒకట వ టౌన్ ఎస్ఐ-1 గా నియమించారు. ఆర్మూర్ ఎస్ఐ 1 గా ఉన్న గంగాధర్ ను నిజామాబాద్ నగరంలోని ఐదవ టౌన్ఎస్ఐ 1 గా, ఐదో టౌన్ఎస్ఐ వెంకట రావును ఆరవ టౌన్ ఎస్ హెచ్ఓగా బదిలి చేశారు. ఒకటవ టౌన్ ఎస్ఐ 1గా పనిచేస్తున్న విక్రమ్ ను మెర్తాడ్ ఎస్ హెచ్ ఒగా నియమితులు అయ్యారు.  ఎస్ బిలో ఉన్న సాయన్నను రూద్రుర్ ఎస్ హెచ్ ఓగా పోస్టింగ్ ఇచ్చారు. విఆర్ లో ఉన్న గోవింద్ కు ఆర్మూర్ ఎస్ఐ 1గా, ఇంద్రకరణ్ రెడ్డిని ఆర్మూర్ ఎస్ఐ 2 గా, ఆర్మూర్ లో ఎస్ఐ 1 ఉన్న గంగాధర్ ను విఆర్ కు బదిలీ చేశారు.