బతుకమ్మ, ఏర్గట్ల : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే సామాజిక,ఆర్ధిక,విద్య, ఉపాధి,రాజకీయ, కుల సర్వే సమగ్ర ఇంటింట కుటుంబ సర్వే లో భాగంగా బుధవారం ఎన్యుమరేటర్ లకు ఏర్గట్ల లో రైతు వేదిక నందు శిక్షణ ఇవ్వడం జరిగినది.ఇట్టి సందర్భంలోతహశీల్దార్ శ్రీలత మాట్లాడుతూ ఎన్యుమరెటర్ లకు కుటుంబసర్వేలో శిక్షణలో భాగంగ చేపట్టే అంశాల గురించి సమగ్రంగా వివరించడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో ఏపిఎం శ్యామ్ ఆర్ ఐ సదానంద్ మండల పరిధిలోని గ్రామపంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.